Jagan and YSRCP MLAs In Assembly Meeting : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్కు సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60రోజులు సభకు గైర్హాజరు అయితే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వారు సభకు హాజరయ్యారని కూటమి నేతలు విమర్శించారు.