Government Focus on LRS Petitions : వైఎస్సార్సీపీ హయాంలో నష్టపోయిన ప్రజలందరి ఇబ్బందులు తీరుస్తూ వస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. 2020లో లేఅవుట్ క్రమబద్ధీకరణతో పథకాన్ని ప్రారంభించిన వైఎస్సార్సీపీ రూ.470 కోట్లు ఫీజులు వసూలు చేసింది. ఆ డబ్బుని పక్కదారి పట్టించి ప్రజలకు అవస్థలు మిగిల్చింది. దీంతో LRSలో ఉన్న 14 వేల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.