Dialysis Patients in Trouble Due To No 108 Services In Anantapur District : ఉమ్మడి అనంతపురం జిల్లాలో డయాలసిస్ రోగుల కష్టాలు ఎంత చెప్పినా తీరవు. నెల రోజులుగా 108 వాహన సేవలు అందకపోవటంతో రోగులను డయాలసిస్కు తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారాని రెండు, మూడుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చులు భరించలేక అప్పులు చేయాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.