ANU Hostel Food Issue: గుంటూరు జిల్లా ఏఎన్యూలో (Acharya Nagarjuna University) విద్యార్థినుల ఆందోళనపై నిజాలు తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోమలితో నియమించిన కమిటీ విశ్వవిద్యాలయంలో పర్యటించింది. కమిటీ సభ్యులు ఇన్ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.