Pawan Kalyan Delhi Tour : దిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అంతకుముందు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ను ఆయన కలిశారు. నోడల్ ఏజెన్సీ పెట్టేందుకు గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదని పవన్ చెప్పారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైనా నిర్ణయం తీసుకోవాలని వచ్చిన మొత్తాన్ని 60:40 నిష్పత్తి ప్రకారం వాటా వచ్చేలా మాట్లాడతామని వెల్లడించారు.