Case On Suvarna Bhoomi Infra Developers MD : సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ సీసీఎస్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పేరుతో మోసగించారని సాఫ్ట్వేర్, విశ్రాంత ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బై బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేశారని వాపోయారు. ఏడాదిన్నర తర్వాత 24 శాతం అధికంగా చెల్లిస్తామని తెలిపారని బాధితులు వెల్లడించారు. స్కీమ్ కాలవ్యవధి దాటినా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదులో కోరారు.