RTC Employees Problems Due to YSRCP Government : వైఎస్సార్సీపీ సర్కారు చేసిన తప్పిదం ఆర్టీసీ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. జీవో 114లో అలవెన్సుల ప్రస్తావన చేయకపోవడంతో ఒక్కో ఉద్యోగి లక్షల్లో నష్టపోయారు. సమస్యను పరిష్కరించి ఆర్టీసీ ఉద్యోగులందరికీ అలవెన్సుల మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించినా ఆర్థికశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఫైల్ ముందుకు కదల్లేదు. ఫలితంగా ఖాతాల్లో సొమ్ము జమకాక ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తమ కష్టాలు తీర్చాలని ఆర్టీసీ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.