Garuda Vahana Seva : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవ తిరుమల గిరుల్లో ప్రారంభమైంది. భక్తుల కన్నులకు ఆనందం కలిగిస్తూ మాడవీధుల్లో గరుడ వాహనంపై తిరుమలేశుడు ఊరేగుతున్నారు. గురుడవాహనంపై శ్రీవారు కొంగు బంగారంగా కనిపిస్తున్నారు. గరుడ సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులతో మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటువైపు చూసిన గోవిందా గోవిందా అనే నామస్మరణం వినిపిస్తోంది. మొత్తం మాడవీధుల్లోని 231 గ్యాలరీలు భక్తులకు కేటాయించగా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. గరుడ సేవకు అత్యధికంగా భక్తులు తిరుమలకు తరలివచ్చిన నేపథ్యంలో టీటీడీ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేసింది. మాడవీధుల్లోని గ్యాలరీలు సరిపోక శిలాతోరణం కూడలి నుంచి క్యూలైన్లోకి భక్తులు ప్రవేశించారు.