Vijayawada Kanaka Durgamma Laddu Prasadam: విజయవాడ దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం ఎంత ముఖ్యమో అమ్మవారి నేతి లడ్డూ ప్రసాదం కూడా అంతే ముఖ్యం. భక్తులకు ప్రసాదం లోటు లేకుండా అందించాలని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 24 గంటలూ వందల మంది సిబ్బంది ప్రసాదాల తయారిలో నిమగ్నమయ్యారు. లడ్డూ విక్రయాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, భక్తుల కోరినంత లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు.