BRS MLA Harish Rao Meet Jainur Victim : హత్యాచార బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జైనూర్ బాధితురాలిని మాజీ మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహా పలువులు నేతలు పరామర్శించారు. అనంతరం రైతు బంధు రాలేదని ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డి మృతదేహానికి హరీశ్రావు గాంధీ ఆసుపత్రిలోనే నివాళులు అర్పించారు.