CM Revanth Tour in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని ముఖ్యంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. జిల్లాలో వరదలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. ఇదివరకే మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్న ఆయన, నష్టపోయిన మూడు తండాలవాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.