Heavy Flood Water To Yadadri Musi River : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. ఉదయం కురిసిన వర్షానికి, హైదరాబాద్ మూసీ నది నుంచి వస్తున్న వరద కారణంగా భారీగా ప్రవహిస్తోంది. మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సంగెం గ్రామ సమీపంలోని బ్రిడ్జికి ఇరు వైపులా వాహనాలను పోలీసులు నిలిపివేశారు.