Cleanliness Problems in Nizamabad : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చెత్త కుప్పలు ప్రజలకు రోగాల తిప్పల్ని తెస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి వీధిలో వాహనంలో తిరుగుతూ సేకరించాల్సి ఉన్నా అది పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఫలితంగా ప్రధాన రహదారుల వెంట చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.