Dalit Groups Strike Across the State : ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దళిత సంఘాల ఆందోళనలతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. ఎస్సీ నాయకులు జాతీయ పలుచోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యాసంస్థలు మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టు పునారాలోచన చేయాలని డిమాండ్ చేశారు.