congress whip adi srinivas on KTR : సీఎం రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పదేళ్లలో విదేశీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్, రాష్ట్రానికి ఎన్ని కంపెనీల పెట్టుబడులు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు.