Devineni and MLC Bhumireddy Organized Public Grievance : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం హయాంలో ఎస్సీలకు ఇచ్చిన ఇన్నోవా వాహనాలను వైసీపీ ప్రభుత్వం సీజ్ చేయించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాలు మళ్లీ వెనక్కి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు.