People Suffering From Floods: గోదావరి, శబరి నదుల వరద కారణంగా అల్లూరి, కోనసీమ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరి నది వంతెన మునిగిపోవడంతో చింతూరు డివిజన్లోని మండలాల్లోని ఇళ్లు మునిపోయాయి. గోదావరి ఉద్ధృతితో పంటలు నీళ్లలో నానిపోయి కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాల బాధితులకు శరవేగంగా సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు.