GARBAGE COLLECTION E AUTOS: గ్రామాల్లో చెత్త సేకరణ కోసం కోట్ల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసిన ఈ-ఆటోలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలకు చేరాయి. గ్రామాల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరించి ఎరువుగా మార్చి రైతులకు ఇవ్వాలనే స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని నీరుగార్చారు. ఆటోల నిర్వహణను గత వైసీపీ పాలకులతో పాటు అధికారులూ పట్టించుకోలేదు. ఫలితంగా ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసిన ఆటోలు అనంతపురం జిల్లా కేంద్రంలో తుప్పు పట్టి పనికిరాకుండా పోతున్నాయి.