Boating Trail Run At Tirupati Papavinasanam : అటవీ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీకు చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని పలువురు భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. సెక్యూరిటీ ఆడిట్లో భాగంగా ప్రయోగాత్మకంగా బోటింగ్ టీమ్ అక్కడ పర్యవేక్షించిందని అటవీ శాఖ తిరుపతి పాలనాధికారి, డీఎఫ్వో వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు.