Chandrababu Speech in Tiruchanur : కూటమి సర్కార్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుపతిలోని తిరుచానూరులో ఇంటింటికీ పైప్లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏజీఅండ్పీ సంస్థకు చెందిన గ్యాస్ సరఫరాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి స్వయంగా టీ చేసి అందించారు. వినియోగదారుడి కుటుంబసభ్యులతో కలిసి తేనీరు సేవించారు. పైప్లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.