BRS Chief KCR Fires On Congress Govt : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోందని, అంతలోనే ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. సిద్దిపేటలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత శ్రీనివాస్రెడ్డిని గులాబీదళంలోకి ఆహ్వానించిన కేసీఆర్, మళ్లీ గులాబీ దళమే తెలంగాణలో అధికారానికి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.