Drinking Water Problem in AIIMS Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్కు నీటి సమస్య అతి త్వరలో తీరనుంది. ఆసుపత్రికి నీటి సరఫరా చేసే పైప్లైన్, పంప్హౌస్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఎయిమ్స్ అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే పెండింగ్ బిల్లులు చెల్లించటంతో పాటు పనులు మళ్లీ ప్రారంభించారు. నవంబర్ నెలఖారుకు నీరివ్వాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.