Central Govt Green Signal to 6 Line Elevated Corridor in Ranasthalam : రహదారులు అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఆరు లైన్లు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి రూ. 252 కోట్లు మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రణస్థలం రహదారిని విస్తరణ చేయాలంటూ గత పాలకులకు అనేక సార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే తమ సమస్యను పరిష్కరించిందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.