A Young Man Ran 77 kilometers in Hyderabad Roads : సాధారణంగా ఓ ఉద్యోగికి సెలవు దొరికిందంటే ఏం చేస్తాడు. సినిమాలకు వెళ్లడమో, కుటుంబసభ్యులతో గడపడమో చేస్తారు. కానీ హైదరాబాద్లోని ఓ యువకుడు మాత్రం సమాజమంలో మార్పు కోసం పరితపిస్తున్నాడు. అందుకే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'రన్ ఫర్ ది నేషన్' పేరిట భాగ్యనగరం రోడ్లపై ఒక్కడే 77 కిలోమీటర్లు పరుగు తీశారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించడంతో పాటు వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.