ప్రజాస్వామ్యం కోసం ఆఖరి వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవరసమో ఆయన పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు. స్వేచ్ఛ సామాన్యుల బాగు కోసమే ఉపయోగపడాలని తలపోశారని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్ తరాలు కొనసాగించాలని పవన్ కల్యాణ్ సూచించారు.