రెండు తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తోన్నాయి. ఏపీ, తెలంగాణల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్రమం తప్పకుండా కుండపోత వానలు పడుతున్నాయి. శని, ఆదివారాల్లో వర్షాల తీవ్రత అధికంగా నమోదైంది. గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. వర్షాల దెబ్బకు కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మంత్రాలయం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.