తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి గురువారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ హిమా కోహ్లితో గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన హిమాకోహ్లి పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా సీజేగా నియమితులయ్యారు