సౌదీ అరేబియా తమ దేశ బ్యాంక్ నోట్పై భారత సరిహద్దులను తప్పుగా చూపినందుకు ఆ దేశానికి భారత్ తీవ్ర నిరసన తెలిపింది. ఈ నోట్లో ఇండియా నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ భూభాగాలను వేరు చేసి చూపారని, దాదాపు తొలగించారని విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఇవి ముమ్మాటికీ భారత అంతర్భాగాలని స్పష్టం చేసింది.