శాంతిచర్చల మాటున చైనా కొట్టిన దొంగదెబ్బకు భరతమాత బిడ్డల్లో ముగ్గురు నేలకొరిగారు. లదాక్ సరిహద్దులో చనిపోయిన ఆ ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చైనా బలగాలతో బాహాబాహీలో ఓ కల్నల్ స్థాయి అధికారితోపాటు ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. ఆయా కుటుంబాలకు ఆర్మీ వర్గాలు సమాచారం అందజేశాయి.