Evening News Express : 3 Minutes 10 Headlines | Bodo Agreement | Coronavirus
  • 4 years ago
CM KCR inaugurates JBS-MGBS metro route in Hyderabad. *Prime Minister Narendra Modi participated in an event to celebrate the signing of the Bodo peace deal in Assam’s Kokrajhar on Feb 07.*CID file a case against seven members on amaravati land.*biryani remark: yogi adityanath gets ec notice over comments targeting kejriwal.
#EveningNewsExpress
#delhiassemblyelections
#bodoagreement
#CoronaVirus
#PMNarendraModi
#chandrababunaidu
#ysjagan
#KCR
#KTR
#davindarsingh

పార్లమెంటులో భారత పౌరసత్వ సవరణ చట్టం పాస్ అయి, చట్టంగా రూపు దాల్చిన తర్వాత తొలిసారిగా అస్సాం పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అస్సాంలో శాంతిమంత్రం కోసమే ఆలోచించి చారిత్రాత్మక బోడో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రధాని మోడీ చెప్పారు.

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ముందుకెళ్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రశంసించని చంద్రబాబు, లోకేశ్.. విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆయన చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్ ఇచ్చింది కరూర్ వైశ్యా బ్యాంకు . గీతం సంస్థల అధినేత శ్రీ భరత్‌ ఆస్తుల జప్తుకే ఏకంగా సిద్ధం అయ్యింది .బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు చెల్లించని కారణంగా భరత్ తండ్రి,చిన్నాన్న,ఇతర కుటుంబ సభ్యులకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై శ్రీ భరత్ స్పందించకపోవడంతో.. ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమైంది బ్యాంక్.
Recommended