Telangana Elections 2018 : నేను మీ సుహాసిని : ప్రజాసేవ చేయాలనే వస్తున్నా ! | Oneindia Telugu

  • 5 years ago
TDP founder Nandamuri Taraka Rama Rao’s granddaughter and TDP politburo member and ex-MP Harikrishna’s daughter Nandamuri Suhasini will contest from the Kukatpally assembly constituency. Here Nandamuri Suhasini Press Meet ahead of Telangana Elections 2018
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దక్కిన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి హరికృష్ణ కూతురు, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ల సోదరి నందమూరి సుహాసిని బరిలో నిలుస్తున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
'నా తెలంగాణ ప్రజలందరికీ.. మీ ఇంటి ఆడబిడ్డగా, నా హృదయ పూర్వక నమస్కారాలు, మీ నందమూరి సుహాసిని' అంటూ ఆమె తన మీడియా సమావేశాన్ని ప్రారంభించారు. తన పైన నమ్మకం ఉంచి, తాను ప్రజలకు సేవ చేస్తానని నమ్మి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున తనకు కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం సీటును కేటాయించారని, అందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని సుహాసిని చెప్పారు. తన స్ఫూర్తి తన తాత, తండ్రి, మామ చంద్రబాబు అని మరోసారి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. తెరాస ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె స్పందిస్తూ.. రేపు అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు.
#TelanganaElections2018
#NandamuriSuhasini
#PressMeet
#chandrababunaidu
#Kukatpallyconstituency

Recommended