Pawan Kalyan, Undavalli and JP Combo : Kathi Mahesh cheap comments
  • 6 years ago
Ex MP Undavalli Arun Kumar met Lok satta founer Jayaprakash Narayana after meeting with Jana Sena chief Pawan Kalyan. Kathi Mahesh said Jana Sena Chief Pawan Kalyan wants to form a Joint Action Committee with former MP Vundavalli Arun Kumar, Lok Satta Party founder Jayaprakash Narayan and others as he has no basic knowledge about bifurcation issues.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమమవారం లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ చొరవతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ జెపితో సమావేశమైనట్లు తెలుస్తోంది. విభజన హామీల అమలు కోసం పోరాటం చేసేందుకు కార్యాచరణను రూపొందించే క్రమంలో ఈ భేటీ జరిగింది.
విభజన హామీల సాధనకు జెఎసిని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ తర్వా సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జిఎఫ్‌సి)ని తెర మీదికి తెచ్చారు. దానిపై ఇప్పటికే జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో పవన్ కల్యాణ్ చర్చలు జరపారు. పవన్ కల్యాణ్ సూచన మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం జెపితో భేటీ అయ్యారు.
ఎపీ హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామని జెపి ఉండవల్లితో భేటీ అనంతరం చెప్పారు. జెఎఫ్‌సీతో పాటు జెఎసి ఏర్పాటుకు కూడా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పాల్గొనడం విశేషం. ఈ నెల 18వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తన్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు పనికి వచ్చే రీతిలో అమలు కావాలని మనం కోరుతున్నామని జెపి మీడియాతో అన్నారు. దేశంలో గానీ రాష్ట్రంలో గానీ తాత్కాలికమైన ఆర్భాటాలు, ప్రకటనలు, హడావిడులపై శ్రద్ధ ఎక్కువగా ఉందని, వచ్చే ఫలితంపై శ్రద్ధ లేదని ఆయన అన్నారు.
మనం చేసే పని వల్ల ప్రజలకు ఏ మేరకు ఫలితం వస్తుంది, యువత ఉపాధి కోసం ఏ మేరకు అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ మేరకు నిధులు అందుతాయనే విషయాలపై హడావిడి లేకుండా ఆలోచన చేస్తామని జెపి చెప్పారు. ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని, చిక్కుముడులు ఎక్కువయ్యాయని జెపి అన్నారు. తమకు చిత్తశుద్ది తప్ప బలం లేదని జయప్రకాశ్ నారాయణ అన్నారు.
Recommended