రంగస్థలం కథ లీక్.. చెర్రీ సూపర్‌..అనసూయ రోల్‌పై క్లారిటీ..!

  • 6 years ago
Rangasthalam is an upcoming Indian Telugu period drama directed by Sukumar and starring Ram Charan and Samantha Akkineni in the lead roles, while Aadhi Pinisetty and Jagapathi Babu play crucial roles.

మెగా హీరో రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సుమారు రూ.100 కోట్ల వ్యయంతో రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాకు సంబంధించిన షూటింగ్ నింపాదిగా నడుస్తున్నప్పటికీ.. వేసవి బరిలో ఈ చిత్రాన్ని వదిలేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. మీడియాలో ప్రచారం జరుగుతున్న ప్రకారం రంగస్థలం కథ ఇదేనట..
చిట్టిబాబు (రాంచరణ్) తండ్రి (రాజీవ్ కనకాల) ఓ వర్గానికి నాయకుడు. చిట్టిబాబు చిన్నతనంలోనే వర్గ విభేదాల కారణంగా తండ్రిని కోల్పోతాడు. తన తండ్రిని మట్టుబెట్టిన వారెవరూ అని తెలుసుకొంటూ చిట్టిబాబు వారి భరత పట్టడం సినిమా కథ.
తన తండ్రిని ఎందుకు? ఎవరు చంపారనే విషయాన్ని తెలుసుకోవడంపై కథ నడుస్తుందట. పగ, ప్రతీకారం అంశాల మధ్య సమంత, రాంచరణ్ మధ్య ఓ ప్రేమకథ కూడా ఆసక్తికరంగా సాగుతుందట. సినిమా కథ సాధారణంగా అనిపించినా సుకుమార్ స్టయిల్‌లో ఈ చిత్రం ఉంటుందట.
సమంత ఈ చిత్రంలో లక్ష్మీ అనే పాత్రను పోషిస్తున్నారనేది లేటేస్ట్ న్యూస్. గ్రామీణ ప్రాంత అమ్మాయిగా సమంత విభిన్నమైన పాత్రను పోషిస్తున్నదట. ఈ చిత్రంలో రాంచరణ్, సమంత కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుంది అనేది తెలిసింది.

Recommended