రంగస్థలంలో అనసూయ పాత్ర లీక్.. క్యారెక్టర్ తెలిస్తే షాకే !

  • 6 years ago
Rangasthalam 1985 is an upcoming Indian Telugu period drama directed by Sukumar and starring Ram Charan and Samantha Akkineni in the lead of roles. The movie will see Ram Charan play a villager and is an action thriller story set in the country side. The movie was launched by Chiranjeevi in February and commenced shooting in April 2017. In this occassion Anchor Anasuya roled leaked in media.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రంగస్థలం లేటు అయినప్పటికీ లేటేస్ట్‌గా వస్తున్నది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో అనసూయకు సంబంధించిన పాత్ర వివరాలు లీక్ అవ్వడం సెన్సేషనల్‌గా మారింది.
జబర్థస్త్ లాంటి టెలివిజన్ చిత్రాలు చేస్తూనే యాంకర్ అనసూయ సినీరంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 1980 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరెకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నది.
గతంలో రాంచరణ్‌తో చిత్ర షూటింగ్‌లో ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ చిత్రంలో ఓ అద్భుతమైన పాత్రను పోషిస్తున్నానంటూ చెప్పింది. అయితే వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.
అలాగే కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా తన పాత్ర వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు. కానీ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అంటూ చిన్న క్లూ ఇచ్చింది.
అయితే రంగస్థలం చిత్రంలో రాంచరణ్‌కు అనసూయ మేనత్తగా నటిస్తున్నారట. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నట్టు సమాచారం. అయితే తన పాత్ర పరిధి మేరకు ఓ మార్క్‌తో అదరగొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తున్నది.

Recommended