IND VS NZ 3rd ODI: India Set Target As 338 for NZ | Oneindia Telugu

  • 7 years ago
India set 338-run target for NZ కివీస్‌ లక్ష్యం 338


కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఓపెనర్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ కోహ్లీ (113) చెలరేగి ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 338 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్‌కు బ్యాటింగ్ ఆహ్వానించింది. జట్టు స్కోరు 29 పరగుల వద్ద శిఖర్ ధావన్ (14)ను ఔట్ చేసిన ఆనందం కివీస్ బౌలర్లకు ఎక్కువ సేపు నిలవలేదు. కోహ్లీ, రోహిత్ శర్మలు న్యూజిలాండ్ బౌలర్లను ఆటాడుకున్నారు. 138 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 147 పరుగులు చేసి అవుటయ్యాడు.

Recommended