IAS Transfers in Andhra Pradesh: వైఎస్సార్సీపీతో అంటకాగిన ఐఏఎస్లపై కూటమి ప్రభుత్వం వేటువేసింది. మొత్తం 18మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం వారిలో ఏడుగురిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. కొందరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ కలెక్టర్లుగా నియమించి విస్మయపర్చింది.