IAS Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వీరిలో ఇప్పటికే ఐదిలీ అయ్యి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులు కొందరు ఉండగా, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు. మొత్తంగా ఒకేసారి 63 మందికి స్థానచలనం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు తాజాగా కీలక పోస్టింగులు దక్కాయి.