Dubbaka Bypoll Result: CM KCR over GHMC Elections | Oneindia Telugu
  • 3 years ago
Telangana CM KCR hold a meeting with ministers today at Pragathi Bhavan and discussed about GHMC elections.

#ElectionResults2020
#DubbakaByPollCounting
#GHMCelections
#DubbakaBypollsResults
#DubbakaBJPCandidateRaghunandanRao
#Electioncounting
#TRS
#DubbakaElections
#CMKCR
#Congress
#BJP
#Siddipet
#Telangana


గ్రేటర్ ఎన్నికల నిర్వహణ,ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు. గురువారం(నవంబర్ 12) అందుబాటులో ఉన్న మంత్రులు,ముఖ్య నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని గ్రేటర్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై కూడా కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయంపై ఎక్కువ ఆందోళన అవసరం లేదని... అక్కడ రఘునందన్ రావుకు సానుభూతి కలిసొచ్చిందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. 'ప్రజల్లో ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదు... దుబ్బాకలో సానుభూతి తప్ప బీజేపీ బలం కాదు.. బీజేపీ గాయి గాయి చేయాలని చూస్తోంది. మనం ఆగం కావద్దు. సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు. బీజేపీ పట్ల దూకుడుగా వ్యవహరించాలి. బీజేపీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను గట్టిగా తిప్పి కొట్టాలి. గ్రేటర్ ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు. అతివిశ్వాసానికి పోకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి.' అని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
Recommended