#Budget2020 : Farmers Be Ready New Rail is Coming For You !! రైతుల కోసం రైలు !!

  • 4 years ago
#Budget2020: Finance Minister proposed to set up Kisan Rail in public-private-partnership.
Rs 2.83 lakh crore to be allocated for agriculture.
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#AgricultureSector
#agriculture
#nirmalasitharaman
#16PointPlan
#indianeconomy
#Parliament
#Farmers
#KisanRail
#Incometaxslab
దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికోసం 16 సూత్రాలను రూపొందించామని, వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా చేపట్టని కొన్ని అరుదైన పథకాలకు జీవం పోశామని అన్నారు.

దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వాటిని నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. కిసాన్ రైలు పేరుతో ఓ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేస్తుందని, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఈ రైళ్లను నిర్వహిస్తారని అన్నారు.

Recommended