India Vs England 2nd ODI: England Beat India By 86 Runs To Level Series 1-1
  • 6 years ago
Riding on Joe Root's century and Liam Plunkett's four-wicket haul, England outclassed India by 86 runs in the second ODI at Lord's on Saturday. With the win, England levelled the three-match series 1-1.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (15), ధావన్‌ (36) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. 8 ఓవర్ల దాకా బాగానే ఆడిన ఓపెనర్లిద్దరూ వరుస ఓవర్లలో నిష్క్రమించడం ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. మార్క్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో రోహిత్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డయ్యాడు.
దీంతో 49 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. విల్లే వేసిన మరుసటి ఓవర్లోనే ధావన్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో లోకేశ్‌ రాహుల్‌ ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. ప్లంకెట్‌ బౌలింగ్‌లో బట్లర్‌ క్యాచ్‌ పట్టడంతో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద రాహుల్‌ ఔటయ్యాడు.
#viratkohli
#msdhoni
#rohitsharma
#eoinmorgan
Recommended