పరిపూర్ణానంద స్వామిని కాకినాడ తరలింపు

  • 6 years ago
శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామిని కాకినాడ తరలింపులో హైడ్రామా చోటు చేసుకుంది. గత ఏడాదిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ స్వామిని పోలీసులు ఇప్పుడు నగరం నుంచి బహిష్కరించారు. కొందరిని సంతృప్తిపరిచేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయనను హైదరాబాద్ నుంచి కాకినాడకు తరలించారు. ఈ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. మార్గమధ్యంలో ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్టేజీ పినపాక గ్రామం వద్ద నేషనల్ హైవేపై కొంతసేపు హైడ్రామా చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం పరిపూర్ణానందను భద్రాచలం శ్రీరాముని దర్శనానికి తీసుకువెళ్లకుండా నేరుగా కాకినాడకు తరలించటానికి పోలీసులు ప్రయత్నించారు.

Sri Peetham pontiff Swami Paripoornananda of Kakinada was externed from Hyderabad for six months for making “provocative statements”. He was escorted by the police to an ashram in Kakinada on Wednesday.

Recommended