India V/s England T20I : Kohli Talks About The Match

  • 6 years ago
కార్ఢిప్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్‌ ఐదు వికెట్ల తేడాతో కోహ్లీసేనపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో, ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది.
తొలి టీ20లో రాహుల్ సెంచరీ చేయగా.... కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన తోడవడంతో భారత్ తేలిగ్గా విజయం సాధించింది. కానీ రెండో టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. నాలుగు ఓవర్లు వేసిన ఈ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయకపోగా, 34 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ నేపథ్యంలో రెండో టీ20కి ఇంగ్లాండ్‌కి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ సన్నద్ధమైన తీరుపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "తొలి ఆరు ఓవర్లలోనే 3 కీలక వికెట్లు కోల్పోయాం. మేం చేయాల్సిన దాని కంటే 15 పరుగులు తక్కువ చేశాం. 149 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బాగానే ప్రయత్నించాం. కానీ మధ్య ఓవర్లలో పరుగులు కట్టడి చేసి.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే కుల్దీప్, చాహల్‌‌లను ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ దీటుగా ఎదుర్కోవడంతో మ్యాచ్‌ ఇంగ్లాండ్ సొంతమైంది" అని అన్నాడు.

England bounced back in style as they defeated India by 5 wickets in the second T20I at Cardiff and levelled the three-match series 1-1 here on Friday (July 6).

Recommended