ప్రభుత్వం ఏర్పాటైన 24గంటల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని సాయికుమార్
- 6 years ago
Cine Actor and BJP MLA Candidate Sai Kumar said that BJP will win in Karnataka assembly polls.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ నేత, ప్రముఖ నటుడు సాయి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తరపున భాగేపల్లి-2 నియోజకవర్గం నుంచి సాయికుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
2008లో 2వేల ఓట్లతో ఓడిపోయిన ఆయన ఇప్పుడు తనదే గెలుపు అని అంటున్నారు. తన తల్లి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తనకు చెప్పారని, అందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
తాను దూరంగా ఉంటున్నాననే భావన తప్ప, ఇక్కడి ప్రజలకు తనపై ఎలాంటి ధ్వేషం లేదని సాయికుమార్ అన్నారు. తాను సున్నాతో మొదలు పెట్టి 25వేల ఓట్లు సాధించే స్థాయికి ఎదిగానని చెప్పారు. ప్రజలంతా తమతోనే ఉన్నారని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. అన్ని పార్టీలలో అవినీతి పరులున్నారని, అదే తన బాధ అని అన్నారు. శ్రీరాములు డిప్యూటీ సీఎం కావాలని ఇక్కడి ప్రజల కోరుకుంటున్నారని అన్నారు.
ప్రస్తుతం సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో ఓడిపోతారని అన్నారు. సిద్ధరామయ్యది స్కాంల ప్రభుత్వమని సాయికుమార్ ఆరోపించారు. చిన్న పని కావాలన్న లంచం, అవినీతి తప్పదని అన్నారు. వేల కోట్ల ఖర్చు పెట్టానంటున్న సిద్ధరామయ్య.. ఏం అభివృద్ధి చేశారో తెలియడం లేదని అన్నారు. రోడ్లు లేవు, స్కూళ్లు లేవు, వైద్య సదుపాయం లేదని అన్నారు.
తమ ప్రభుత్వం ఏర్పాటైన 24గంటల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని సాయికుమార్ తెలిపారు. కన్నడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించారని తెలిపారు. మోడీ, షాల నేతృత్వంలో వచ్చే ప్రభుత్వం కన్నడ ప్రజలకు మంచి, నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తుందని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఒక్క స్కాం కూడా జరగలేదని సాయికుమార్ చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ నేత, ప్రముఖ నటుడు సాయి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తరపున భాగేపల్లి-2 నియోజకవర్గం నుంచి సాయికుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
2008లో 2వేల ఓట్లతో ఓడిపోయిన ఆయన ఇప్పుడు తనదే గెలుపు అని అంటున్నారు. తన తల్లి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తనకు చెప్పారని, అందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
తాను దూరంగా ఉంటున్నాననే భావన తప్ప, ఇక్కడి ప్రజలకు తనపై ఎలాంటి ధ్వేషం లేదని సాయికుమార్ అన్నారు. తాను సున్నాతో మొదలు పెట్టి 25వేల ఓట్లు సాధించే స్థాయికి ఎదిగానని చెప్పారు. ప్రజలంతా తమతోనే ఉన్నారని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. అన్ని పార్టీలలో అవినీతి పరులున్నారని, అదే తన బాధ అని అన్నారు. శ్రీరాములు డిప్యూటీ సీఎం కావాలని ఇక్కడి ప్రజల కోరుకుంటున్నారని అన్నారు.
ప్రస్తుతం సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో ఓడిపోతారని అన్నారు. సిద్ధరామయ్యది స్కాంల ప్రభుత్వమని సాయికుమార్ ఆరోపించారు. చిన్న పని కావాలన్న లంచం, అవినీతి తప్పదని అన్నారు. వేల కోట్ల ఖర్చు పెట్టానంటున్న సిద్ధరామయ్య.. ఏం అభివృద్ధి చేశారో తెలియడం లేదని అన్నారు. రోడ్లు లేవు, స్కూళ్లు లేవు, వైద్య సదుపాయం లేదని అన్నారు.
తమ ప్రభుత్వం ఏర్పాటైన 24గంటల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని సాయికుమార్ తెలిపారు. కన్నడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించారని తెలిపారు. మోడీ, షాల నేతృత్వంలో వచ్చే ప్రభుత్వం కన్నడ ప్రజలకు మంచి, నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తుందని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఒక్క స్కాం కూడా జరగలేదని సాయికుమార్ చెప్పారు.