Celebrity Cricket League 2025 : ఈగ సినిమా విలన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు తన టీమ్తో కలిసి బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, మెట్రో సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగారు. సామాన్యులతో కలిసి ఆయన మెట్రోలో ఇలా సాధారణంగా ప్రయాణించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 11 సీజన్లుగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతూ వస్తుంది. కర్ణాటక బుల్డోజర్స్ టీమ్కు కిచ్చా సుదీప్ కెప్టెన్గా ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఉప్పల్ స్టేడియంలో కర్ణాటక టీమ్ చెన్నై రైనోస్తో తలపడనుంది. ఫిబ్రవరి 15న తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్లకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.