కేడీ అరుణ, గద్వాలకు ఏం చేశావో చెప్పు - వైఎస్ షర్మిల *Telangana | Telugu OneIndia
  • 2 years ago
DK Aruna was targeted by YS Sharmila in Gadwal. Sharmila who stated that she is not DK Aruna and she is KD Aruna. ys sharmila asked her to tell what was done to Gadwal

వైఎస్సార్ బిడ్డకు తెలంగాణాలో ఏం పని అని ప్రశ్నించిన డీకే అరుణను వైఎస్ షర్మిల గద్వాల్ వేదికగా టార్గెట్ చేశారు. డీకే అరుణ కాదు కేడీ అరుణ అని పేర్కొన్న షర్మిల గద్వాలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.వైయస్ఆర్ మంత్రి పదవి ఇస్తేనే కదా డీకే అరుణమ్మకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది అని పేర్కొన్న వైయస్ షర్మిల వైయస్ఆర్ తర్వాత ఇన్నేండ్లుగా రాజకీయాల్లో ఉండి, గద్వాలకు డీకే అరుణమ్మ ఏం చేశారు? అంటూ నిలదీశారు. వైయస్సార్ బిడ్డకు తెలంగాణలో ఏం పని అని డీకే అరుణ గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం వైయస్ షర్మిల స్పందించారు. తాను వైయస్సార్ బిడ్డనని, తెలంగాణ గడ్డ మీద పెరిగానని, ఇక్కడే చదువుకోవడం తో పాటు తన బిడ్డకు కూడా జన్మనిచ్చానని వైయస్ షర్మిల వెల్లడించారు. తన బ్రతుకు తన గతం ఇక్కడేనని పేర్కొన్న ఆమె తెలంగాణలో వైఎస్సార్ పాలన లేదు కాబట్టే తను పార్టీ పెట్టాను అని స్పష్టం చేశారు.

#YSRTP
#Sharmilla
#Telangana
#DKaruna
#PrajaPrasthanamPadayatra
#Gadwal
Recommended