ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశను పంజాబ్ కింగ్స్ విజయంతో ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్(42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో ఒంటిచేత్తో విజయాన్నందించాడు.