భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదవుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా చాలా తక్కువ కరోనా కేసులు నమోదైన ఢిల్లీలోనూ తాజాగా కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించింది.