Andhra Pradesh Governor Biswabhushan Harichandan ON AP 3 Capitals | Oneindia Telugu
  • 3 years ago
The 72nd Republic Day celebrations held at the Indira Gandhi Municipal Stadium in Vijayawada. Andhra Pradesh Governor Biswabhushan Harichandan said in his speech 'We will establish Visakhapatnam as the administrative capital. We will establish Vijayawada as the Legislative Capital. We will make Kurnool the capital of justice'.

#72ndRepublicDaycelebrations
#AP3Capitals
#GovernorBiswabhushanHarichandan
#APCMJagan
#Amaravathi
#Visakhapatnam
#administrativecapital
#Kurnool
#LegislativeCapital


రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. క్లారిటీ ఇచ్చారు. విస్పష్ట ప్రకటన చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఉద్దేశమేమిటనేది తేల్చి చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేదిక మీదుగా ఆయన మూడు రాజధానుల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణను అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను గురించి ప్రస్తావించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా బదలాయిస్తుందని గవర్నర్ అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా తన ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని తన ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతోన్న వారిని కఠినంగా శిక్షంచడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోందని గవర్నర్ అన్నారు. శాంతిభద్రతలకు భగ్నం కలిగించే వారు ఎప్పటికైనా శిక్షార్హులేనని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలను తీసుకుంటుందని హామీ ఇచ్చారు.


Recommended