రేవంత్ రెడ్డికి పిసీసీ పగ్గాలు అప్పగించే యోచనలో ఏఐసీసీ|Revanth Reddy As TPCC Chief Chances To Oppose
  • 5 years ago
Congress is the only place to be involved in revising the parties regionally. The Congress is planning to change the ongoing PCC positions and give them a chance to new ones. In Telangana, Malkajgiri MP Revanth Reddy, who plays an active role in active politics, is campaigning for the Congress to make Telangana PCC president. If the PCC is being Revanth Reddy, there is a debate that there is a possibility of opposition from the senior head.
#telangana
#telanganapolitics
#congressparty
#tpcc
#highcommand
#revanthreddy
#AICC

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ అదిష్టానం. సోనియా గాంధీ ఏఐసిసి అద్యక్షురాలు అయిన తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రాంతీయంగా పార్టీలను పునర్మించేందుకు పావులుకదుపుతోంది కాంగ్రెస్ అదిష్టానం. ప్రస్తుతం కొనసాగుతున్న పీసీసీ అద్యక్షులను మార్చి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా ప్రణాళిక రచిస్తోంది కాంగ్రెస్. తెలంగాణలో క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి కి తెలంగాణ పిసీసీ అద్యక్షుడిని చేయాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక వేళ పిసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపడితే స్ధానికంగా ఉన్న సీనియర్ నేతలనుండి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
Recommended