అప్పుల కుప్పగా మారిన తెలంగాణ || Telangana Debts Increased To 1,80,000 Crores || Oneindia Telugu
  • 5 years ago
Telangana State Government Paying Crores of Rupees as Interest amount for debts. In 2014, there is only 69 thousand crores debts. Now telangana debts increased to One lakh eighty thousand crores. These details are released in written by Central Finance Minister Nirmala Sitaraman in Rajyasabha as congress MP MA Khan raised the questions.
#telangana
#debts
#interest
#central
#rajyasabha
#NirmalaSitaraman
#FinanceMinister
#MAKhan

తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? 2014లో రాష్ట్ర ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ ఐదేళ్లలో అప్పులు గణనీయంగా పెరిగిపోయాయా? తెలంగాణ ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వడ్డీగా కడుతోందా? రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్న అప్పు ఇప్పటికీ మూడింతలు పెరిగిందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానంగా తెలంగాణ అప్పుల కుప్పగా మారిందనే విషయం స్పష్టమవుతోంది. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలే అందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దరిమిలా 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అయితే అంతవరకు 69 వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ ఈ ఐదేళ్లలో అది దాదాపు మూడింతలకు చేరడం విస్మయం కలిగిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గణాంకాలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి.
Recommended